న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో రూ.కోటి విలువైన 90 ఐఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి మూడు పార్సిళ్లలో వచ్చిన ఫోన్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వస్త్రాల పేరు చెప్పి ఫోన్లను తరలిస్తున్నారని ఎయిర్ కార్గో కస్టమ్స్ (ఏసీసీ) ఎక్స్పోర్ట్ కమిషనరేట్ పేర్కొంది. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్స్రే విభాగంలో స్కానింగ్ చేయగా ఫోన్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో 90 ఐఫోన్ 12 ప్రో మోడల్ ఫోన్లు ఉన్నాయని, వాటి విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.