న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో భారత్ పోరాడుతున్నది. పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడడంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో భారత్కు అంతర్జాతీయంగా సహకారం కొనసాగుతున్నది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్ సహా పలు దేశాలు ముందుకు విషయం తెలిసిందే. ఐర్లాండ్ సైతం భారత్కు 700 యూనిట్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 365 వెంటిలేటర్లతో కూడిన కార్గో విమానం ఢిల్లీకి చేరింది. ‘యూరోపియన్ భాగస్వామి, స్నేహితుడికి మద్దతు విలువైనది’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరవిందం బాగ్చి ట్వీట్ చేశారు.
🇮🇳 🇮🇪
— Arindam Bagchi (@MEAIndia) April 29, 2021
International cooperation continues! Shipment containing 700 units of oxygen concentrators & 365 ventilators arrives from Ireland. Deeply value the support from our EU partner & friend 🇮🇪 pic.twitter.com/snpecSsHEA
హాంకాంగ్ నుంచి 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు గురువారం రాత్రి భారత్ చేరుకున్నాయని కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే అమలులో ఉన్న అన్ని ప్రయత్నాలను మరింత బలపరుస్తుందని ట్వీట్ చేశారు. అలాగే గురువారం యూకే నుంచి 120 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేషన్ పరికరాలు, బెడ్ మానిటర్లు, మందులతో కూడిన రెండు రష్యా విమానాలు సైతం భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే.
Strategic global cooperation at work.
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 29, 2021
300 oxygen concentrators & other medical equipment land in Delhi from Hong Kong on a @IndiGo6E flight.
These supplies are further bolstering all ongoing efforts which are already in place.
Together We Can.@MEAIndia @MoCA_GoI @DelhiAirport pic.twitter.com/6CPfKO7CAK