వరంగల్, ఏప్రిల్ 19( నమస్తేతెలంగాణ)/మహబూబాబాద్: వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజు శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశా రు. వరంగల్లో రాష్ట్ర సమాఖ్య పార్టీ అభ్యర్థిగా నేనా ప్రేమ్రెడ్డి రిపిక, స్వతంత్ర అభ్యర్థిగా పెరంబుదూరి కృష్ణసాగర్, బీఎస్పీ అభ్యర్థిగా పంజా కల్పన తమ నామినేష న్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీ ప్రావీణ్యకు అందజేశారు. ప్రేమ్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా కూడా నా మినేషన్ దాఖలు చేశారు. కృష్ణసాగర్, పంజా కల్పన ఒక్కో సెట్, ప్రేమ్రెడ్డి రెండు సెట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
దీంతో నామినేషన్లు దాఖలు చేసి న మొత్తం అభ్యర్థుల సంఖ్య ఆరుకు చేరింది. ఇక్కడి నుంచి బరిలోకి దిగే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థు లు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ, ఆధార్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జాటోత్ రఘునాయక్ ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బోడ అనిల్ నాయక్ ఒక సెట్ నామినేషన్ను జిల్లా రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్ సింగ్కు అందించారు. రెండు రోజు ల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేష న్లు దాఖలు చేసినట్లు ఆర్వో వెల్లడించారు.