SRH vs RR | రాజస్థాన్ బ్యాటర్లు ఉతికారేస్తున్నారు. 202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. కానీ తర్వాత క్రీజులోకి దిగిన రియాన్ పరాగ్ (25), యశస్వి జైస్వాల్ (32)తో కలిసి చెలరేగి ఆడుతున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేశారు. రాజస్థాన్ విజయం సాధించాలంటే 84 బంతుల్లో 142 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న బట్లర్ (0) జాన్సెన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (0) క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.