హెల్మండ్ : పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ప్రాక్సీ వార్ చేస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ ప్రావిన్స్లో వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ సైనిక అధికారి ఒకరు మరణించారు. పాక్ అధికారి గాయపడిన ఇల్లు అల్ ఖైదా రహస్య స్థావరం వద్ద ఉన్నది. ఇక్కడ జరిగిన వైమానిక దాడుల్లో అల్-ఖైదా ఉగ్రవాదులు 23 మంది మరణించారు. దాంతోపాటు పాకిస్తాన్ అధికారి కూడా గాయపడ్డారు. ఆ అధికారి పరిస్థితి విషమంగా ఉండటంతో పాక్ సైన్యం అతడ్నిక్వెట్టాలోని దవాఖానలో చేర్చారు. అక్కడ అతను తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ మరణించాడు.
బాల్ఖ్ ప్రావిన్స్లోని తాలిబాన్ స్థావరాలపై ఆఫ్ఘన్ భద్రతా దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 23 తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సైనిక అధికారి గాయపడి మరణించడం.. పాక్ సైన్యం ఉగ్రవాదులకు రక్షణ కల్పించడమే కాకుండా ఆఫ్ఘన్ భద్రతా దళాలతో వివాదంలో పాల్గొంటుందని స్పష్టం చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ పట్ల స్నేహపూర్వకంగా లేదా శత్రుత్వంగా ఉండాలా అని నిర్ణయించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఇప్పటికే పాకిస్థాన్ను కోరారు. ఆఫ్ఘనిస్తాన్, కెనడాలో ఉన్న ఒక మాజీ దౌత్యవేత్త కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులతో పాకిస్తాన్ ప్రాక్సీ వార్ చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాది జూలై 30 న బోరిస్ జాన్సన్ పెండ్లి
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
భారత్లో 5 జీ ట్రయల్స్కు మార్గం సుగమం
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
రా, ఐబీ చీఫ్ పదవీకాలం పొడగింపు
‘వీర్ సావర్కర్’ సినిమాను ప్రకటించిన సందీప్, అమిత్ వాద్వానీ
నటసార్వభౌముడు పుట్టింది ఇవాళే.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..