బెంగళూరు : కర్ణాటకలోని హసన్ జిల్లాలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వీరంతా కేరళ నుంచి వచ్చిన చెందిన వారు. విద్యార్థినులంతా పేయింగ్ గెస్టులు ఉండగా.. భవనాన్ని మూసివేశారు. 24 మంది ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. విద్యార్థునులు కాటిహల్లి పారిశ్రామిక ప్రాంతంలో నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. 21 మంది కరోనా సోకిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు జూలై 26కి ముందు హసన్కు వచ్చారు. వారంతా ప్రతికూల ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్లను సమర్పించారు. కొవిడ్ లక్షణాలు కనిపించగా.. గత మంగళవారం ఓ విద్యార్థికి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థినులను క్వారంటైన్కు తరలించారు. కరోనా సోకిన విద్యార్థినులను కలిసిన వారందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ సోకిన వారికి లక్షణాలు ఎక్కువగా లేవని అధికారి వివరించారు.