Chicken Shawarma | వీధుల్లో అమ్ముతున్న చికెన్ షావర్మా (Chicken Shawarma) తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో చోటు చేసుకుంది.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ (Goregaon) ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
Also Read..
Amit Shah | ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
Smriti Irani | అమేథిలో స్మృతి ఇరానీ స్కూటర్ రైడ్.. ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్ర మంత్రి
Sreenivasa Prasad | బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత