తొర్రూరు, ఆగస్టు 27 : వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఇస్రో, డీఆర్డీవో సాంకేతిక సహకారంతో దీన్ని తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రోత్సాహంతో మండల అభివృద్ధి కమిటీ, జాతీయ పతాక ప్రతిష్ఠాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు నేతృత్వంలో దాతల సహకారంతో రూ.20లక్షల వ్యయంతో ఈ భారీ జెండాను తీర్చిదిద్దారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, 1650 క్వింటాళ్ల బరువైన జెండా పోల్పై 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో జాతీయ పతాకం రూపుదిద్దుకుంది.
సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి జాతీయ జెండా రెపరెపలాడుతూ రెపరెపలాడుతూ కనిపిస్తూ దేశ ఔన్నత్యం, తొర్రూరు ఘనకీర్తిని చాటనుంది. ఈ నెల 29న మంత్రి ఎర్రబెల్లి ఇక్కడ ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రితోపాటు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, కలెక్టర్ కె.శశాంక, సీబీఐ పూర్వ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఉషాదయాకర్రావు, కోఆర్డినేటర్గా వందేమాతరం ఫౌండేషన్ టి.రవీంద్ర పాల్గొననున్నారు. కాగా, శనివారం నిర్వాహకుడు సోమేశ్వర్రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు శామకూరి ఐలయ్య, గుండాల నర్సయ్య, దొంగరి శంకర్, కుర్ర శ్రీనివాస్, ధరావత్ జైసింగ్నాయక్, చీకటి శ్రీనివాస్, కందాటి అశోక్రెడ్డి, కౌన్సిలర్ గుగులోత్ శంకర్, జిలుకర సురేందర్ తదితరులు ఉన్నారు.