కమాన్పూర్/జన్నారం/ఘట్కేసర్, మార్చి 30: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వాడాలని, నిర్ణీతదూరం పాటించాలని చెప్తున్నారు. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నారు. పలుచోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో మాస్కులు ధరించని 11 మందిపై సోమవారం రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్యామ్పటేల్ తెలిపారు. వీరిని బుధవారం మంథని కోర్టులో హాజరుపరుచనున్నట్టు పేర్కొన్నారు. సుల్తానాబాద్లో మాస్క్ పెట్టుకోని 30 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో మంగళవారం 15 మంది దుకాణాదారులకు మున్సిపల్ కమిషనర్ సురేశ్కుమార్ జరిమానా వేశారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని పొనకల్ అంగడిలో మాస్కులు ధరించని ముగ్గురు వ్యాపారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.
ఇవీ కూడా చదవండి
హెచ్సీయూ, ఈఎస్ఐల మధ్య కుదిరిన ఒప్పందం
ప్రకృతి నూనెలు.. ఆరోగ్య ప్రసాదాలు