హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మధ్య 5 సంవత్సరాల కాలపరిమితితో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ అప్పారావు పేర్కొన్నారు. వీసీ సమక్షంలో రిజిస్ట్రార్ సర్ధార్సింగ్, ఈఎస్ఐ ఎంసీహెచ్ డైరెక్టర్, డీన్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు మాట్లాడుతూ ఇరు సంస్థల మధ్య మెరుగైన పరిశోధనలతోపాటు విద్యార్థుల నైపుణ్యతలు, ప్రమాణాలు పెంపొందించే దిశగా ఈ ఒప్పందం కొనసాగుతుందన్నారు. 5 సంవత్సరాల కాల పరిమితితో ఉన్న ఒప్పందం ద్వారా విద్యా, పరిశోధనలు, అధ్యాపకుల మార్పిడి అవకాశాలు, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఆదేశాల ప్రకారం వర్సిటీలోని దవాఖాన అభివృద్ధికి సహాయం తదితర అంశాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.