ఇండోర్ : ఓ వ్యక్తి మాస్కు సరిగా ధరించలేదని అతన్ని పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 35 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి హాస్పిటల్లో ఉన్న తన తండ్రి కోసం భోజనం తీసుకెళ్తున్నాడు. అయితే అతను సరిగా మాస్కు ధరించలేదని పోలీసులు ఆపారు. ఆ తర్వాత అతన్ని రోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టారు. తలపై కాలు పెట్టి తొక్కారు. ఆ వ్యక్తి బంధువులు ఎంత వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు వ్యక్తిని కొట్టిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..