ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా అందులో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పరేడ్లో ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ టీమ్ అందరి కంటే ముందు ఉంటుంది. ఈసారి కూడా గ్రీస్ టీమ్ తరఫున షూటింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో పాల్గొంటున్న అనా కొరకాకి, ఎలిఫ్తోరియోస్ పెట్రోనియాస్ గ్రీస్ జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడిచారు. జపాన్ భాష ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీమ్స్ పరేడ్లో పాల్గొన్నాయి. ఇండియన్ టీమ్ తరఫున మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు ఈ పరేడ్లో పాలుపంచుకున్నారు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన బాక్సర్ మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో ముందు నడిచారు. ఎన్నడూలేని విధంగా ఈసారి 127 మంది అథ్లెట్ల బృందంతో ఇండియా వెళ్లినా.. ఓపెనింగ్ సెర్మనీలో మాత్రం వారి సంఖ్య 19కే పరిమితమైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
– Advertisement –
Tokyo Olympics: టోక్యోలో రోడ్లపై బతుకీడుస్తున్న వాళ్లను వెళ్లగొట్టిన నిర్వాహకులు
టోక్యో ఒలింపిక్స్ ఖర్చు ఎంత? జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?
Tokyo Olympics: తమ్ముడి కోసం అన్న త్యాగం.. బాక్సర్ అమిత్ ఇన్స్పైరింగ్ స్టోరీ
టోక్యో ఒలింపిక్స్లో టీమిండియా.. వీటిలో మెడల్స్ పక్కా
ఆమె ఇప్పటికీ జీవించి ఉన్న ఓల్డెస్ట్ ఒలింపిక్ చాంపియన్.. ఎవరామె? వయసెంత?
రేవతి వీరమణి.. ఒలింపిక్స్కు వెళ్తున్న ఈ వీర వనిత స్టోరీ చదివి తీరాల్సిందే!
Tokyo Olympics: చరిత్ర సృష్టించనున్న 12 ఏళ్ల సిరియా ఒలింపియన్