ఇంఫాల్: జాతుల వైరంతో అల్లాడిపోయిన మణిపూర్లో రాష్ట్రపతి పాలన తొలగిపోయింది. కొత్త సీఎంగా యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా నెమ్చా కిప్జెన్, లోసియి దిఖో, హోంమంత్రి గోవిందాస్ కొంతౌజమ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. (Yumnam Khemchand Singh) మణిపూర్లో అభివృద్ధిని తీసుకురావడానికి బీజేపీ జాతీయ నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందని సీఎం యుమ్నం ఖేమ్చంద్ సింగ్ తెలిపారు. తమ కొత్త ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తుందని చెప్పారు. 61 ఏళ్ల యుమ్నం ఖేమ్చంద్ మైతీ వర్గానికి చెందినవారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులైన నెమ్చా కిప్జెన్ కుకీ, లోసియి దిఖో నాగా తెగలకు చెందినవారు.
కాగా, మెజారిటీ మైతీ వర్గానికి ఎస్టీ హోదాను బీజేపీ ప్రభుత్వం కల్పించడాన్ని మైనారిటీలైన కుకీ, ఇతర తెగలు వ్యతిరేకించాయి. దీంతో మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి. ఏడాదిపైగా కొనసాగిన హింసలో వందలాది మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రులయ్యారు.
మరోవైపు మైతీ వర్గానికి చెందిన నాటి సీఎం ఎన్ బీరెన్ సింగ్ కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు వీడియో వైరల్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025 ఫిబ్రవరిలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఏడాది తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో బుధవారం ఉదయం రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది.
Also Read:
Car Tries To Run Over Man | నగ్నంగా మారి వ్యక్తి హంగామా.. అతడిపైకి కారు దూకించేందుకు యత్నం
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్లో దాచారు