దేశంలో కొందరు పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. పాక్ను మీరు ఇంతలా ప్రేమిస్తుంటే మీరు దేశానికి భారంగా ఇక్కడ ఎందుకు..అక్కడికే వెళ్లి అడుక్కోండని కోరాలని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని హమీర్పూర్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయని విపక్ష ఇండియా కూటమి నేతలు బెదిరిస్తున్నారని, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే మన వద్ద ఉన్న అణుబాంబులను ఫ్రిజ్లో దాచేస్తామా అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత పదేండ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ మరోసారి ప్రధాన మంత్రిగా పాలనా పగ్గాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Kashmir Cricketer: హుషారుగా క్రికెట్ ఆడుతున్న 102 ఏళ్ల కశ్మీరీ తాతయ్య.. వీడియో