కోల్కతా: కొందరు మహిళలు రైలులో సిగరెట్లు కాల్చారు (Women smoke in Train). అంతేగాక గంజాయి పీల్చారు. దీనిని సహించలేకపోయిన ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి టాటానగర్ నుంచి కతిహార్ వెళ్లే రైలులో ప్రయాణించాడు. అయితే అసన్సోల్ రైల్వే స్టేషన్లో కొందరు వ్యక్తులు ఆ రైలు ఎక్కారు. ఆ బృందంలోని మహిళలు సిగరెట్లు కాల్చడంతోపాటు గంజాయి పీల్చారు. రాత్రంతా దానిని కొనసాగించారు.
కాగా, ఆ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి ఆ మహిళలు కాల్చిన సిగరెట్లు, గంజాయి వాసనతో పాటు, వారి చర్యలను భరించలేకపోయాడు. తన మొబైల్ ఫోన్లో దీనిని రహస్యంగా వీడియో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియో క్లిప్ను రైల్వే శాఖకు పంపి దీని గురించి ఫిర్యాదు చేశాడు. ‘టాటానగర్ నుంచి కతిహార్ వెళ్లే రైలులో అసన్సోల్ స్టేషన్లో ఎక్కిన మహిళలు రాత్రంతా ‘గంజాయి, సిగరెట్లు’ తాగారు’ అని ట్విట్టర్ ద్వారా రైల్వేకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు రైల్వే శాఖకు చెందిన రైల్వే సేవా విభాగం దీనిపై స్పందించింది. ‘సర్, దయచేసి ప్రయాణ వివరాలు (పీఎన్ఆర్/ట్రైన్ నంబర్) మొబైల్ నంబర్ను డీఎం ద్వారా షేర్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మీరు నేరుగా http://railmadad.indianrailways.gov.in లో మీ ఆందోళనను తెలియజేయవచ్చు. లేదా సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చు’ అని రైల్వే సేవా విభాగం ట్వీట్ చేసింది. అయితే ఆ ప్రయాణికుడు ఆ వివరాలు పంపాడా?, ఆ మహిళలపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారా? అన్నది తెలియలేదు.
కాగా, ఆ ప్రయాణికుడు షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మహిళలు రైలులో సిగరెట్లు, గంజాయి తాగడాన్ని కొందరు విమర్శించారు.
Sir, we request you to please share the journey details (PNR/Train No.) and Mobile No. with us preferably via DM. You may also raise your concern directly on https://t.co/JNjgaq11Jl or dial 139 for speedy redressal.
– RPF India https://t.co/utEzIqAAkm— RailwaySeva (@RailwaySeva) February 27, 2023