Bank Employees | న్యూఢిల్లీ, మే 8: బ్యాంక్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తమ తమ బ్యాంకుల ద్వారా పొందే వడ్డీ రహిత లేదా రాయితీ వడ్డీ రుణాలూ ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనలకు లోబడే ఉంటాయని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది. బ్యాంక్ సిబ్బంది తీసుకునే సదరు రుణాలను ‘పెర్కిజిట్’తో పోల్చిన కోర్టు.. ఈ ప్రయోజనాన్ని అందరూ పొందుతారన్నది.
కాబట్టి వీటికీ పన్నులు వర్తిస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే ఈ కేసులో ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 17(2) (viii) లేదా ఐటీ చట్టం 1962లోని రూల్ 3(7)(i)లను సమర్థిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.