హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఎదురొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 72 కేసులు తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యాయి. హత్యాయత్నం, అల్లర్లు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్లు ఆయనపై నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 19 క్రిమినల్ కేసులతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అ సోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా విశ్లేషణలో ఇవి వెలుగులోకి వచ్చాయి.
దేశంలోనే అత్యంత సంపన్న ము ఖ్యమంత్రిగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన ప్రకటించి న ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు. ఏపీ సీఎం చంద్రబాబు రూ.931 కోట్ల ప్రకటిత ఆస్తులతో రెండో స్థా నంలో నిలిచారు. రూ.648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.30 కోట్లు కాగా, ఈ జాబితాలో ఆయన ఎనిమిదో స్థానంలో నిలిచా రు. దేశంలోని దాదాపు 40 శాతం మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు డిక్లేర్ చేశారు.
అందులో తీవ్రమైన నేరారోపణలు ఎదురొంటున్న వారు 33 శాతం వరకు ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. అత్యల్ప ఆస్తులున్న వారిలో పశ్చిమబెంగాల్ సీఎం మమ తాబెనర్జీ(రూ.15 లక్షలు), జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (రూ.55 లక్షలు) చివరి స్థానాల్లో ఉన్నారు. దేశంలోని సగటు ముఖ్యమంత్రి ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉన్నది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత పెంపొందించడమే ఈ నివేదిక ఉద్దేశమని ఆ సంస్థ వెల్లడించింది.