Train | రైలు (Train) ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు ఒక్క రైల్లో మాత్రమే ఉంటుంది. అయితే, రద్దీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ధర తక్కువగా ఉండటంతో తక్కువ దూరానికి సైతం చాలా మంది రైలు సర్వీసులనే అనుసరిస్తుంటారు. దీంతో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న గొడవలు చోటు చేసుకుంటుంటాయి.
తాజాగా తల్లీ కుమార్తె సీటుకోసం ఓ వ్యక్తితో గొడవ పడుతున్న (Women clash with man) వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. రైల్లో పై సీట్లో కూర్చున్న వ్యక్తితో ఆ తల్లీ కూతుళ్లు గొడవకు దిగారు. అతడి కాలర్ పట్టుకొని దుర్బాషలాడారు. డెహ్రాడూన్-గోరఖ్పూర్ ట్రైన్లో (Dehradun Gorakhpur train) ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Kalesh b/w a Mother-Daughter Duo and a Man inside Dehradun to Gorakhpur train over Seat issues on Women’s Day
pic.twitter.com/N4Xrcy7hAS— Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024
Also Read..
Upasana | అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన మెగా కోడలు ఉపాసన
Oscars 2024 | ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్ఆర్ఆర్.. VIDEO
Inayat Vats | 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం.. ఆయన యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి