Upasana | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram Mandir) టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, మెగా కోడలు ఉపాసన (Upasana) సందర్శించారు. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయంలో 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ (Ram Raag Sewa) మార్చి 10తో ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఉపాసన ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య వెళ్లారు. తాత, నాయినమ్మ, తల్లి సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఉప్సీ తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది. రామ మందిరాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Oscars 2024 | ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్ఆర్ఆర్.. VIDEO
Inayat Vats | 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం.. ఆయన యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి