బెంగళూరు: ఒక మహిళ భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. దీని గురించి నిలదీసేందుకు సోదరుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో భర్త ప్రియురాలి కొడుకు వారిద్దరిని కత్తితో పొడిచి చంపాడు. (Woman, Brother Stabbed To Death) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలైన మల్లేగౌడ, 36 ఏళ్ల యమున బెంగళూరులోని పీన్యా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు.
కాగా, ఛాయ అనే మహిళ, మల్లేగౌడ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య యమునకు ఈ విషయం తెలిసింది. దీంతో తన సోదరుడైన 34 ఏళ్ల సుదీప్తో కలిసి భర్త ప్రియురాలు ఛాయ ఇంటికి వెళ్లింది. తన భర్త, ఆమె మధ్య సంబంధం గురించి నిలదీసింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గొడవ జరిగింది.
మరోవైపు ఈ ఘర్షణ నేపథ్యంలో ఛాయ కుమారుడైన 16 ఏళ్ల బాలుడు యమున, సుదీప్ను కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Bengal Polls | ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బెంగాల్ ఎన్నికల్లో పోటీ.. బీజేపీ మూడో జాబితాలో చోటు
Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్