Khalistani terrorist | ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈనెల 13లోగా పార్లమెంట్పై దాడి చేస్తామని హెచ్చరించాడు (Will attack Parliament).
ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ వీడియోకి ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ (ఢిల్లీ ఖలిస్థాన్గా మారబోతోంది) అనే శీర్షికతో వీడియో రిలీజ్ చేశాడు. ఈనెల 13వ తేదీ లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్ను కూడా అందులో ప్రదర్శించాడు. ఈ వీడియోలో తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని అన్నారు. కాగా, డిసెంబర్ 13వ తేదీకి పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు నిండనుంది. 2001 డిసెంబ్ 13వ తేదీకి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాలు జరుగుతన్న వేళ ఇలా ఖలిస్థాన్ ఉగ్రవాది నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పన్నూన్ బెదిరింపుల వీడియో బయటకు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పార్లమెంట్ పరిసరాల్లో సెక్యూరిటీని మరింత టైట్ చేశాయి. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, పన్నూన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. నవంబర్లో కూడా ఇలానే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని, నవంబర్ 19 న ఎయిర్ ఇండియా విమానంలో ఎవరూ ప్రయాణించవద్దని పన్నూన్ వార్నింగ్ ఇచ్చాడు. నవంబర్ 4న విడుదల చేసిన ఓ వీడియోలో పన్నూన్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్పత్వంత్ ఆ వీడియోలో హెచ్చరించారు. అదేవిధంగా నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్టు.. దాని పేరును మార్చనున్నట్టు గుర్పత్వంత్ చెప్పారు. అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్లో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవలే గుర్పత్వంత్.. ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు.
Also Read..
SpiceJet | ప్రయాణికుడికి గుండెపోటు.. కరాచీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్