Couple | పాపులారిటీ కోసం భార్యాభర్తలు (Couple) దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా కన్న బిడ్డను అమ్ముకున్నారు. ఆ వచ్చిన డబ్బుతో హనీమూన్ లకు తిరిగి ఎంజాయ్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర 24 పరగణాల (North 24 Parganas) జిల్లా పానిహతిలోని గాంధీనగర్ కు చెందిన జయదేవ్, సాథి దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ సంపాదించుకోవాలని అనుకున్నారు. అందరిలాగే రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కలలు కన్నారు. అయితే వారి వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. దాన్ని కొనుగోలు చేసే పరిస్థితుల్లో కూడా వారు లేదు. దీంతో కన్న కొడుకుని అమ్మకానికి పెట్టారు. ఎనిమిది నెలల కుమారుడిని రూ.2 లక్షలకు విక్రయించారు. ఆ వచ్చిన డబ్బుతో ఓ స్మార్ట్ ఫోన్ (Smart Phone) కొనుగోలు చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. హనీమూన్ (Honeymoon) కోసం దిఘా, మందరమణి సముద్ర తీరాలు సహా అనేక ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవారు.
అయితే, కొన్ని రోజులుగా తమ కుమారుడు కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో చిన్నారి ఎక్కడ అని ఇరుగుపొరుగు వారు ప్రశ్నించగా.. అమ్మేసినట్లు జయదేవ్, సాథి దంపతులు తెలిపారు. ఆ వచ్చిన డబ్బుతో ఫోన్ కొని పలు ప్రదేశాలను సందర్శించినట్లు చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
RTC Bus | పైకప్పు ఊడినా రోడ్డుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
Manipur Violence | రాత్రంతా బుల్లెట్ల శబ్దాలే.. మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటన
Rain update | హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు