అయోధ్య: అయోధ్యా రాముడి(Ayodhya Ram Mandir) కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కానుకలు అందుతున్నాయి. 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో.. ప్రజలు తమ రామభక్తిని ప్రదర్శిస్తున్నారు. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయోధ్యకు కానుకలు వచ్చినట్లు విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. ఆ గిఫ్ట్లను శ్రీ రామాలయం యజమాని అనిల్ మిశ్రాకు అందజేసినట్లు చెప్పారు. కశ్మీర్కు చెందిన ముస్లిం సోదరసోదరీమణులు తనను కలిశారని, రామాలయ నిర్మాణం పట్ల వాళ్లు సంతోషం వ్యక్తం చేశారని, భిన్న మతాలను అవలంబిస్తున్నా.. తమ పూర్వీకులు అంతా ఒక్కటే అని వారు చెప్పినట్లు అలోక్ కుమార్ తెలిపారు. కశ్మీర్లో ఉత్పత్తి చేస్తున్న ఒరిజినల్ కుంకుమ పువ్వును తమకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. సిల్క్ బెడ్షీట్పై రామాలయం బొమ్మ వేసిన కానుకను తమిళనాడు అందజేసినట్లు చెప్పారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ప్రవహించే కుభా నది జలాన్ని రాముడి అభిషేకం కోసం పంపినట్లు అలోక్ కుమార్ తెలిపారు.
#WATCH | Ayodhya, UP: Vishwa Hindu Parishad President Alok Kumar hands over gifts received from Kashmir, Tamil Nadu, and Afghanistan to ‘Yajman’ of Shri Ram Temple Anil Mishra.
He says, “Muslim brothers and sisters from Kashmir came to meet me and expressed their happiness at… pic.twitter.com/g8Vywcde6J
— ANI (@ANI) January 20, 2024