జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీల మధ్య అక్కడ ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పుడు వారి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. దాంతో టీఎంసీ, బీజేపీ శ్రేణులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ప్రతిపక్ష నేత సువేంధు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రచారం సాగుతుండగా, టీఎంసీ ప్రచార బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రే తన భుజస్కందాలపై వేసుకున్నారు. అందులో భాగంగా ఇవాళ జల్పాయ్గురిలోని మాల్బజార్లో మమత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ టీ స్టాల్లో ఆమె టీ తయారు చేసి వడ్డించారు. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | West Bengal CM Mamata Banerjee makes tea and serves it to people at a tea stall in Jalpaiguri’s Malbazar, as a part of her campaign for upcoming Panchayat polls pic.twitter.com/s2TiVIdyET
— ANI (@ANI) June 26, 2023