మయూర్భంజ్: భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఒడిశాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోగల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ (Similipal Tiger Reserve) ను ఆమె సందర్శించారు. అక్కడ జింకలు, కోతులు, పులులు ఇతర జంతువులను చూసి ఆనందించారు. రాష్ట్రపతి టైగర్ రిజర్వ్ సందర్శనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | President Droupadi Murmu visited Similipal Tiger Reserve in Mayurbhanj, Odisha. A place with rich biodiversity and wildlife, the tiger reserve is the only natural habitat in the world to protect the rare melanistic tigers popularly known as the black tigers.
(Video:… pic.twitter.com/5mxIcMSroE
— ANI (@ANI) May 6, 2023
సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అత్యున్నత జీవ వైవిధ్యం, అత్యధిక వన్య ప్రాణులు కలిగిన టైగర్ రిజర్వ్. బ్లాక్ టైగర్స్గా పిలిచే మెలానిస్టిక్ పులులకు రక్షణ కల్పిస్తున్న ఆ టైగర్ రిజర్వ్.. వాటికి ప్రపంచంలో ఏకైక సహజ ఆవాసం. కాగా, రాష్ట్రపతి సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ సందర్శనకు సంబంధించిన దృశ్యాలను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.