వారణాసి: మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను అరెస్ట్ చేయడం, శివసేనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టడంతో మహారాష్ట్ర అట్టుడుకుతున్నది. విశ్వ హిందూ సేన అధ్యక్షుడు అరుణ్ పాఠక్ మరో ఘాటైన ప్రకటన చేసి అగ్నికి ఆజ్యం పోశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణె (Narayan Rane) తల నరికి తెచ్చినవారికి రూ.51 లక్షల రివార్డును అరుణ్ పాఠక్ ప్రకటించారు. ఈ మేరకు తన ప్రకటనను ఫేస్బుక్, ట్విట్టర్లో ప్రకటించారు. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా పోస్టర్లను అతికించిన కేసులో మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు.
ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. నారాయణ రాణె అస్థికలను కూడా కాశీలో నిమజ్జనం చేయడానికి అనుమతించబోమని పాఠక్ పేర్కొన్నారు. రాణెను బాలాసాహెబ్ ఠాక్రే శివ సైనికుడిగా చేస్తే.. ప్రజాదరణ పొందడానికి బీజేపీ బాలాసాహెబ్ కుమారుడిపైనే దాడి చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠక్ రివార్డు ప్రకటనపై స్పందించేందుకు బీజేపీ నాయకులు ముందుకు రాలేదు. ఇలాఉండగా, ఉద్ధవ్ ఠాక్రేపై రాణె చేసిన వ్యాఖ్యలపై తమ చర్యను శివసేన సమర్థించుకున్నది. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుందని హెచ్చరించింది.
సాంకేతిక అంతరాల్లేని అంతర్జాల విద్య రావాలి: వెంకయ్యనాయుడు
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..