గాజా సిటీ: గాజాలో కొందరు చిన్నపిల్లలు తమ బొమ్మతో సరదాగా ఆడిన ఆట చూపరులకు కంటతడి పెట్టిస్తూ అక్కడి విషాద పరిస్థితులకు అద్దం పడుతున్నది. కొంతమంది పిల్లలు కలిసి ఒక బొమ్మను పాడెపై శవాన్ని ఎత్తినట్టు అతి జాగ్రత్తగా పైకెత్తి చిన్న స్ట్రెచ్చర్పై ఉంచి, శవయాత్ర మాదిరిగా దానిని మోస్తూ మెల్లిగా నడుస్తుండగా, మరికొందరు మౌనంగా నడుస్తూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఒక శవయాత్ర పిల్లలకు కొత్త ఆటలా మారిందంటే గాజాలో నెలకొన్న విషాదం, శవయాత్రలు వారికి నిత్యకృత్యంగా మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ దాడులతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో పౌరులు మరణించడం, వారి అంతిమ యాత్రలు నిత్యకృత్యంగా మారడంతో పిల్లలు ఈ అంతిమయాత్రనే ఒక కొత్త ఆటగా భావించి ఆనందపడటం నిజంగా దురదృష్టమే.