రామగిరి, ఆగస్టు 4: మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ‘10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ’ మెగా ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్ తదితర వ్యసనాలకు బానిసలుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కేవలం డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనికి వ్యవస్థతో పాటు ప్రతి ఒకరూ బాధ్యత వహించాలరు. మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను, కెరీర్ను నాశనం చేసుకుంటున్నామని యువత తెలుసుకోవాలన్నారు. డ్రగ్స్కు అలవాటు పడితే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం పడుతుందని, ఒక దశలో తీవ్ర ఏకాకితనం ఆవహిస్తుందన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడినా, విక్రయించినా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చుట్టుపకల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, విక్రయించినా తక్షణమే 1908 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుత జెన్జీ తరం డ్రగ్స్ ఫ్రీ తరంగా నిలవాలని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థతో పాటు ఎన్జీ కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలను ఆయన అభినందించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్ను ఆవిషరించారు. కార్యక్రమంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ రమేష్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, బ్రహ్మకుమారి రాజయోగి ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డీఎమ్హెచ్వో నగేష్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఆర్. మదన్ మోహన్, శ్రీధర్, బ్రహ్మకుమారీస్ ప్రతినిధి కుమారి మోనిక, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ సీహెచ్. సుధాకర్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు వెంకట్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.