ప్రజలకు సేవ చేస్తున్నామని, పనికి తగిన వేతనం చెల్లించాలని ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ కమిటీ (ఆయుష్ హెచ్ఎస్ అండ్ పీజీ- జేఏసీ) ఆధ్వర్యంలో స్కాలర్లు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. రామంతాపూర్తోపాటు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి, నేచర్ క్యూర్ బల్కంపేట, ప్రభుత్వ నిజామియా యునాని కళాశాల అండ్ ఆస్పత్రి పరిధిలో ధర్నా చేశారు.
-రామంతాపూర్, ఆగస్టు 4