Karur Stampede | కరూర్లో టీవీకే పార్టీ (TVK party) చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట (Karur Stampede) ఘటన పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు (Madras High Court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ (SIT) విచారణకు ఆదేశించింది. ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది.
తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో టీవీకే పార్టీ (TVK party) నేతకు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు (Madras High Court) నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్కుమార్ (Satish Kumar) దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని కోర్టు ప్రశ్నించింది. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. అంతేకాదు టీవీకే చీఫ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలదేని కూడా ప్రశ్నించింది. ఈ మేరకు ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది.
ఇదిలావుంటే తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్పై మీ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ కోర్టు.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్లో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
Also Read..
Karur Stampede | కరూర్ తొక్కిసలాట.. టీవీకే పార్టీ నేతకు బెయిల్ నిరాకరించిన మద్రాస్ హైకోర్టు
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. మద్రాస్ హైకోర్టులో టీవీకే పార్టీకి చుక్కెదురు
Snow Leopards | హిమాచల్ ప్రదేశ్లో 83 మంచు చిరుతలు.. నాలుగేండ్లలో 62 శాతం పెరుగుదల : సర్వే