Private Jet Skids Off Runway | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ప్రైవేట్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై జారి పక్కకు దూసుకెళ్లిన (Private Jet Skids) విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వారందరినీ ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
బెంగళూరులోని రియల్ ఎస్టేట్ సంస్థ వీఆర్ఎస్ వెంచర్స్ (VSR Ventures)కు చెందిన లీర్జెట్ 45 ఎయిర్క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్, గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) నుంచి టేకాఫ్ అయ్యింది. ముంబై విమానాశ్రయంలోని (Mumbai Airport) రన్వే 27లో ల్యాండింగ్ సందర్భంగా విమానం చక్రాలు రన్వేపై స్కిడ్ కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా వర్షం కురుస్తుండటం వల్ల రన్వే సరిగా కనిపించకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు సహా ముగ్గురు సిబ్బంది పైలట్, కో-పైలట్, ఒక ఫ్లైట్ అటెండెంట్ ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో వారంతా గాయాలపాలైనట్లు వెల్లడించారు. అయితే ప్రమాద సమయంలో విజిబిలిటీ దాదాపు 700 మీటర్లు ఉన్నట్లు సమాచారం.
Also Read..
Nipah virus | కేరళలో మరొకరికి నిఫా వైరస్.. 6కు పెరిగిన పాజిటివ్ కేసులు
Heavy Rain | తడిసి ముద్దైన దేశ రాజధాని ఢిల్లీ
Missing woman Ramya | పదేళ్ల వయసులో తప్పిపోయి 20 ఏళ్ల తర్వాత ఇల్లు చేరిన మహిళ