(Venkaiah Naidu) చెన్నై: కుటుంబ జీవితానికి, విధుల నిర్వహణకు మధ్య సరైన సమన్వయంతో పాటు సమాన ప్రాధాన్యతను అందించేలా జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇలాంటప్పుడే పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేందుకు, భవిష్యత్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు వీలవుతుందన్నారు.
ఇలాంటి విధివిధానాలను రూపొందించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. సోమవారం చెన్నైలో ‘డాక్టర్ వీఎల్ దత్- గ్లింప్సెస్ ఆఫ్ ఎ పయనీర్స్ లైఫ్ జర్నీ’ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. విదేశాల్లోనూ మన కుటుంబ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉన్నదన్నారు. అయితే, ప్రస్తుతం వివిధ కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించే దిశగా యువత ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దత్ జీవితాన్ని పుస్తకరూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయన సతీమణి శ్రీమతి వీఎల్ ఇందిరాదత్, యు ఆత్రేయ శర్మ, కుమారి అంబికా అనంత్ను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..