లక్నో : వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ సంస్ధ వెలుపల రెండు నెలల కిందట విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు బీజేపీ సభ్యులని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. నవంబర్ 2న ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినిపై బైక్పై వెళుతున్న దుండగులు క్యాంపస్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
విద్యార్ధిని దుస్తులు విప్పి కెమెరాలో రికార్డు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు ఐఐటీ-బీహెచ్యూలో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నిందితులను కునాల్ పాండే, అభిషేక్ చౌహాన్, సాక్షం పటేల్గా గుర్తించారు. నిందితులను వారణాసిలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో నిందితులు ముగ్గురూ బీజేపీ కార్యకర్తలు కావడంతో కేసును కాషాయ పార్టీ నీరుగార్చుతోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. కాగా ఈ కేసులో నిందితులతో పాటు విద్యార్ధినిని వేధింపులకు గురిచేసేందుకు వాడిన బైక్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read More :
Traffic alert | న్యూఇయర్ వేడుకలు.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు