ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారత్కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బిజీబిజీగా గడిపారు. ముంబైలో తన పర్యటన తీరును కండ్లకు కడుతూ ఆయన టూర్ విశేషాలను ట్విట్టర్లో షేర్ చేశారు. మన్నత్లో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్తో భేటీ నుంచి ఇరానీ కేఫ్లో సేదతీరేవరకూ పలు విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Great meeting with Mukesh Ambani to learn about Reliance’s innovations in the renewable energy sector, and exploring avenues for more #USIndiaTogether economic cooperation. pic.twitter.com/tlCvWr7UAv
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) May 17, 2023
ముంబైలో తన తొలిరోజు పర్యటనలో భాగంగా గార్సెట్టి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో సమావేశమయ్యారు. ముంబైలో మహాత్మా గాంధీ ఇల్లు మణి భవన్ను సందర్శించారు. ఆపై గార్సెట్టి నీతా ముఖేషఖ్ అంబానీ కల్చరల్ సెంటర్ను సందర్శించారు. మన్నత్లో షారుక్ ఖాన్ను కలిసిన గార్సెట్టి ఆపై బిలియనీర్ ముఖేష్ అంబానీతో సమావేశమయ్యారు.
Stopped by the legendary Kyani & Co. to try their delicious bun maska and chai, a specialty of Mumbai’s Irani cafes. I have to say, I’m a fan! #Mumbaikars – what else should I try on my next visit? pic.twitter.com/xs1AYzZiRT
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) May 17, 2023
బిజీ షెడ్యూల్లోనూ గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించారు. ఇక హిందూ దేవాలయం, మసీదు, జొరాస్ట్రియన్ ఆలయం, కాథలిక్ యూనివర్సిటీలను సందర్శించారు. ఇరానీ కేఫ్లో ఛాయ్తో పాటు బన్ మస్కాను ఆస్వాదించారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో 26/11 మెమోరియల్ను సందర్శించి నివాళులు అర్పించారు. మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో భేటీ అయిన దౌత్యవేత్త ఆపై మహీంద్ర రైజ్ ఎలక్ట్రిక్ వాహనంపై దక్షిణ ముంబై వీధులను కలియతిరిగారు.
Read More
Leo Movie | తండ్రి కొడుకులుగా విజయ్, సంజయ్ దత్.. ఇది కదా అసలు ట్విస్ట్ అంటే?