Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని ఆ పార్టీ మండిపడింది. ప్రధాని మోదీ తన ఎంఏ పొలిటికల్ సైన్స్ కోసం ప్రచారార్భాటం విషయంలో గోబెల్స్ గురించి క్షుణ్ణంగా చదివి ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఓ అసత్యాన్ని పదేపదే వాస్తవంగా ప్రచారం చేస్తే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే గోబెల్స్ విశ్వాసాన్ని మోదీ అనుసరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ న్యాయ్ పత్ర గురించి ప్రధాని నిస్సిగ్గుగా పచ్చిగా అసత్యాలు వల్లెవేశారని ఆరోపించారు. అసత్యమేవ జయతే అనేది ప్రధాని నరేంద్ర మోదీ నినాదమని ఈ విషయం మరోసారి రుజువు చేస్తోందని అన్నారు.
ఆయన మాట్లాడిన ప్రతిసారీ సత్యాన్ని వధిస్తారని మండిపడ్డారు. ఆస్తుల పున:పంపిణీ రగడపై కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యల కలకలం నేపధ్యంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ సారధ్యంలో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని సాగుతున్న ప్రచారంపై కమలనాధుల్లో కలవరం వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లను తాము రద్దు చేయబోమని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీల రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని మోదీ సహా ఆ పార్టీ అగ్రనేతలు హామీ ఇస్తున్నారు.
Read More :