PM Modi | కర్నాటకలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం లేదని దోపిడీ ముఠాను నడుపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సోమవారం బాగల్కోట్లో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
టెక్ హబ్గా పేరొంది ప్రపంచంలోనే తనదైన ముద్ర వేసిన కర్నాటకను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకర్ హబ్గా మార్చిందని ఎద్దేవా చేశారు. 2జీ స్కామ్ తరహాలో కుంభకోణాలకు పాల్పడి జేబులు నింపుకోవాలని కాంగ్రెస్ పాలకులు కలలు కంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ దోచుకోవడం మినహా రాష్ట్ర ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా చెల్లించలేని దుస్ధితిలోకి కర్నాటక కాంగ్రెస్ సర్కార్ జారుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
MP Prajwal Revanna | ‘సెక్స్ స్కాండల్’లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్