యూజీన్ (యూఎస్ఏ): వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్షిప్స్లో భారత మహిళళ 4X400 మీటర్ల రిలే జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్స్కు క్వాలిఫై అయిన భూమిక, తాహుర, తనూ చౌదరి, థియా అరుముగమ్ బృందం.. రేసును 3 నిమిషాల 45.28 సెకన్లలో పూర్తిచేసి ఏడో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో యూఎస్ఏకు స్వర్ణం, ఆస్ట్రేలియాకు రజతం, బ్రిటన్కు కాంస్యం దక్కాయి.
మహిళల హైజంప్లో పతకంపై ఆశలు రేపిన భారత పూజ సైతం నిరాశపరిచింది.ఫైనల్లో ఆమె 1.84 మీటర్లే దూకగా ఆస్ట్రేలియా (1.92 మీ.), హంగేరి (1.90 మీ.), స్పెయిన్ (1.90 మీ.) అథ్లెట్లు టాప్-3లో నిలిచి పతకాలు గెలిచారు. 2022 ఎడిషన్ తర్వాత ఈ టోర్నీని భారత్ మూడు పతకాల (2 రజతాలు, ఒక కాంస్యం)తో ముగించింది.