న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి శాంతి నగర్లో రోడ్లు రద్దీగా ఉన్నాయి. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారుపై కాల్పులు ప్రారంభించారు. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. అనంతరం వారు అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని అజయ్ చౌదరి, జస్సా చౌదరిగా గుర్తించారు. మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు.
#WATCH | More than 10 rounds of firing reported yesterday in the Subhash Nagar area of West Delhi has left 2 injured. Police & top officials were deployed at the spot. More details awaited: Delhi Police
(Video: CCTV) pic.twitter.com/EJaE6FKIEh
— ANI (@ANI) May 7, 2022
కాల్పులకు తెగబడినవారిని గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని వెల్లడించారు.