Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.ఐదో దశలో భాగంగా ముంబై సహా మహారాష్ట్రలోని 13 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇక తమకు ఆధిక్యం లభించే ప్రాంతాల్లో అధికారుల నిర్వాకం కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఈవీఎంలను సరిగ్గా ఏర్పాటు చేయలేదని, యంత్రాలు పనిచేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే ఈ లోపాలు తలెత్తాయని చెప్పారు. ఓటమి భయంతో కాషాయ పాలకులు ఈసీ ద్వారా కుయుక్తులకు తెగబడ్డారని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగే ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా పోలింగ్ శాతాన్ని తగ్గించారని అన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరితో వ్యవహరించిందని అన్నారు.
కొన్ని వర్గాల ప్రజలను గుర్తింపు కార్డులు చూపాలని పదేపదే విసిగించారని ఆరోపించారు. ఓటమి భయంతో ఈసీని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. పక్షపాత ధోరణితో వ్యవహరించిన అధికారుల పేర్లను పోలింగ్ ముగిసిన అనంతరం వెల్లడిస్తామని ఠాక్రే పేర్కొన్నారు.
Read More :
Rave Party | నాకు రేవ్ పార్టీ తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన హేమ