భువనేశ్వర్: జనాభా గణన విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఎండలు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో వారు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. (teachers die of heatstroke) ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఎండలు మండుతుండటంతో ఆ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. మయూర్భంజ్ జిల్లాలోని బెటనటి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడైన రాజ్కపూర్ హెంబ్రమ్కు జనగణన కోసం మూడు గ్రామాలు కేటాయించారు. శనివారం ఇంటింటి సర్వే కోసం వెళ్లిన ఆయన ఎండలకు తాళలేక వడదెబ్బకు గురయ్యారు. జనగణన విధులు ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత తనకు అనారోగ్యంగా ఉందని చెప్పారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా, సుందర్గఢ్ జిల్లా జరాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అనురాగ్ ఎక్కా కూడా శనివారం జనగణన విధి నిర్వహణలో వడదెబ్బకు గురయ్యారు. అస్వస్థత చెందిన ఆయనను తొలుత గురుండియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
మరోవైపు జనగణన విధి నిర్వహణలో వడదెబ్బకు గురై ఇద్దరు టీచర్లు మరణించడంపై ఆయా జిల్లా కలెక్టర్లు స్పందించారు. అధికారుల నుంచి నివేదికలు అందిన తర్వాతే వారి మరణాలకు గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అన్నారు.
Also Read:
Man Kills Old Man | బస్సు రూట్ చెప్పనందుకు.. వృద్ధుడ్ని చంపిన యువకుడు
Watch: ట్రంప్కు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన కర్ణాటక మంత్రి.. ఎందుకంటే?