కరోనా కొత్త రూపును సంతరించుకొని ప్రపంచాన్ని మరోసారి గడగడలాడిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే అక్కడ చాలా కేసులు నమోదు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల మీద నిఘా పెట్టాయి.
అయితే.. తాజాగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానం దిగిన ఇద్దరు సౌత్ ఆఫ్రికా దేశస్థులకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వాళ్లను వెంటనే క్వారంటైన్కు తరలించారు.
వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో టెస్ట్ చేసేందుకు వాళ్ల శాంపిల్స్ను ల్యాబ్కు పంపించినట్టు బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. మరో 48 గంటల్లో టెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరుతో పాటు కర్ణాటక మొత్తం పోలీసులు, వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగుతున్న అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేశాకనే బయటికి పంపిస్తున్నారు.
హైరిస్క్లో ఉన్న దేశాల నుంచి ఇప్పటి వరకు బెంగళూరు విమానాశ్రయానికి 584 మంది రాగా.. అందులో 94 మంది ప్రయాణికులు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. అందులో ఇద్దరికి కరోనా సోకినట్టు తేలింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కొత్త వేరియంట్కు ఒమిక్రాన్ అనే ఎందుకు పెరుపెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై నెటిజన్ల మీమ్స్ వైరల్
omicron : ఒమిక్రాన్ వేరియంట్పై ప్రధాని మోదీ సమీక్ష.. విదేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా