కరోనా బాధ పోయింది ఇక. ఇక నుంచి అయినా ప్రశాంతంగా రోడ్ల మీద తిరగొచ్చు అని ప్రపంచం ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్న నేపథ్యంలో అందరికీ భారీ షాక్ ఇస్తూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమైన వైరస్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి.
ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణికులపై భారత్తో సహా అన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. భారత్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాకున్నప్పటికీ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది.
ఇక.. సోషల్ మీడియాలోనూ ఈ కొత్త వేరియంట్పై ప్రచారం జోరుగా సాగుతోంది. కరోనా కొత్త వేరియంట్పై నెటిజన్లు కూడా భయంతో మీమ్స్ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 2021తోనే కరోనా భయం కూడా ముగుస్తుందని అనుకున్నాం కానీ.. ఇలా 2022 వచ్చే సమయానికి డేంజరస్ వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని అనుకోలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిందరవందరగా బెడ్రూమ్.. కాంపిటిషన్లో గెలిచిన 8 ఏళ్ల బాలిక.. ఫోటోలు వైరల్
వరద నీటిలో నడవడం కోసం భలే ఐడియా.. నువ్వు తోపు అంటున్న నెటిజన్లు
నడవడం ఇష్టం లేక అంబులెన్స్కు ఫోన్.. 39 సార్లు ఫ్రీ ట్యాక్సీలా వాడుకున్నాడు