Election Commissioners | కేంద్ర ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ (Dr Sukhbir Singh Sandhu) , జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా వీరు ఈసీఐలో చేరారు. కమిషనర్లుగా శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్గా ఉన్నారు. కమిషనర్గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది. గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ కొత్త కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సింధూ, జ్ఞానేశ్ కుమార్లను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు.
కేరళకు చెందిన కుమార్, ఉత్తరాఖండ్కు చెందిన సంధూ ఇద్దరూ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో కుమార్ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా, సంధూ గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా వ్య వహరించారు. కాగా, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేడు సుప్రీంలో విచారణ
ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీం లో నేడు విచారణ జరగనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించి ఆ స్థా నంలో క్యాబినెట్ మంత్రిని చేర్చటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Two newly-appointed Election Commissioners, Gyanesh Kumar and Dr Sukhbir Singh Sandhu joined the Commission today: ECI pic.twitter.com/N5ZXd4RxQQ
— ANI (@ANI) March 15, 2024
Also Read..
All England Open | నంబర్ 1 సాత్విక్ – చిరాగ్ ఔట్.. క్వార్టర్స్లో లక్ష్యసేన్
CAA: సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
Russian Presidential Elections | రష్యాలో అధ్యక్ష ఎన్నికలు.. తిరువనంతపురంలో పోలింగ్