వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) అమలు చేసేందుకు ఇటీవల కేంద్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళనగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిది మాథ్యూ మిల్లర్ తెలిపారు. సీఏఏను ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని మిల్లర్ తెలిపారు. వివక్షకు గురైన మైనార్టీలకు సీఏఏ ద్వారా రక్షణ కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన మైనార్టీలకు సీఏఏ ద్వారా రక్షణ కల్పించనున్నట్లు షా తెలిపారు.