Earthquake | మహారాష్ట్ర (Maharashtra)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. గురువారం ఉదయం కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
హింగోలి (Hingoli) నగరంలో గురువారం ఉదయం 10 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలిపింది. ముందుగా ఉదయం 6:08 గంటల సమయంలో మొదటి సారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. ఆ తర్వాత 6:19 గంటలకు రెండో సారి భూమి కంపించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
కాగా, ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)ను కూడా వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముందుగా తెల్లవారుజామున 01:49 గంటల సమయంలో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత 03:40 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Also Read..
Bengaluru | బెడ్రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ.. పొరుగింటి జంటపై మహిళ ఫిర్యాదు
PM Modi | రష్యా – ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి భారత్ పూర్తి మద్దతు : ప్రధాని మోదీ
Solar Eclipse | ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ దేశంలో అంధకారం