హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు సింగరేణివ్యాప్తంగా 13,170 హెక్టార్లలో 5 కోట్ల 90 లక్షల మొక్కలు నాటడం విశేషం. ఇవి వనాలుగా మారుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో డైరెక్టర్లు, ఇతర అధికారులు మొక్కలు నాటారు. స్వయంగా 11,026 మొక్కలు నాటి, రికార్డు నెలకొల్పిన సింగరేణి డైరెక్టర్ బలరాంకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సారథ్యంలోని గ్రీన్చాలెంజ్ సంస్థ ప్రతినిధులు వనమిత్ర పత్రం అందజేశారు.