Earthquake | ఉత్తరాది రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించాయి. గురువారం తెల్లవారుజామున రెండు గంటల వ్యవధిలోనే స్వల్ప స్థాయిలో రెండు సార్లు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
మొదట తెల్లవారుజామున 01:49 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలిపింది. పశ్చిమ కమెంగ్లో భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత 03:40 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.4గా నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్లో కేంద్రీకృతమై ఉంది. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
రెండు భూకంపాలూ స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. దీని కారణంగా కొండ ప్రాంతంలో ఇళ్లు భారీ కుదుపులకు లోనయ్యాయి. గాఢ నిద్రలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read..
Minister Ponnam | ఒక్క చెక్కు ఎమ్మెల్యే చేతికి పోయినా బాగుండదు.. మరో వివాదంలో మంత్రి పొన్నం
Arunachal Pradesh | అరుణాచల్ భారత్లో అంతర్భాభాగమే.. తేల్చిచెప్పిన అమెరికా
RBI | ఈ నెల 31న పనిచేయనున్న బ్యాంకులు.. ఎందుకో తెలుసా?