RBI | ముంబై, మార్చి 20: ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసింది.
ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 31న అన్ని బ్యాంకుల శాఖలు తెరిచివుంచాలని సూచించింది.