న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సుస్మితాదేవ్ పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సరిపడా సంఖ్యాబలం లేని కారణంగా బీజేపీ సుస్మితాదేవ్పై తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆమె ఎంపిక ఏకగ్రీవమైంది. కాగా, గతంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సుస్మితాదేవ్.. ఈ ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ను వీడి టీఎంసీలో చేరారు. కాంగ్రెస్లో ఉండగా సుస్మితాదేవ్ అసోంలోని సిల్చార్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.
కాగా, తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జికి సుస్మితాదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. మమతాబెనర్జి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యురాలిగా తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.