Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 200 స్దానాలు కూడా దాటదని టీఎంసీ నేత సుస్మితా దేవ్ అన్నారు. విపక్ష ఇండియా కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్మితా దేవ్ శుక్రవారం కోల్కతాలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ధరల మంట, నిరుద్యోగం వంటివి ప్రధానాంశాలని ఆమె పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ అంశాలను కాషాయ పార్టీ మరుగుపరుస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన బీజేపీకి ఈసారి ప్రజలు ఓట్లు వేసే ప్రసక్తే లేదని అన్నారు. బెంగాల్ ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ లేదని అన్నారు.
ఈసారి బీజేపీకి ప్రజల చేతిలో భంగపాటు తప్పదని ఆమె జోస్యం చెప్పారు. బెంగాల్లో టీఎంసీకి అత్యధిక స్ధానాలు లభిస్తాయని తెలిపారు. కాగా, కేంద్రంలో విపక్ష ఇండియా కూటమికి టీఎంసీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తుందని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
Read More :
Kavya Maran: కావ్యా మారన్ను హగ్ చేసుకున్న కివీస్ క్రికెటర్.. వీడియో